Tuesday, March 06, 2007

మీకు తెలుసా?

1. మాయా బజార్ చిత్రానికి మొదట రాజేశ్వర రావు గారు సంగీత దర్శకులుగా పని చేసారు అని? ఆయన నాలుగు పాటలు కూడ స్వరపరిచారు ("చూపులు కలిసిన శుభవేళా", "నీకోసమె నే జీవించునది", "నీవేనా నను పిలచినది", "లాహిరి లాహిరి లాహిరిలో"), తర్వాత ఏదో గొడవల వల్ల మిగతా సంగీతం కూర్చడం ఘంటసాల గారి బాధ్యత అయ్యింది.
2. పాతాళ భైరవి సినిమాలో సావిత్రి నటించిందని? భలే రాముడు ఉజ్జయిని రాజపరివారానికి తన మాయామహలు వింతలు చూపిస్తున్నప్పుడు వచ్చే ఒక పాటలో ("ఇక రానంటే రానే రాను") ఓ రెండు నిమిషాల సేపు కనబడుతుంది సన్నటి సావిత్రి. ముఖాన్ని పట్టించి చూస్తే గాని గుర్తు పట్టడం కష్ఠం కాని నాట్యంచేసే తీరు బట్టి గుర్తుపట్టేయవచ్చు.

2 comments:

  1. ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

    ReplyDelete
  2. చాలా ఆశక్తికరం గా వున్నాయి.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.